Fake news: 747 వెబ్ సైట్లను, 94 యూట్యూబ్ ఛానెల్లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే?
Government blocked YouTube channels: నకిలీ వార్తలను, కల్పిత కథనాలకు వ్యాప్తి చేసే ప్లాట్ఫారమ్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2021-22లో నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు ప్రభుత్వం 94 యూట్యూబ్ ఛానెల్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 వెబ్ సైట్లను బ్లాక్ చేసింది.
Government blocked YouTube channels: నకిలీ వార్తలను వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2021-22లో నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు ప్రభుత్వం 94 యూట్యూబ్ ఛానెల్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు (URL)లను బ్లాక్ చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వివరాలు వెల్లడించారు.
దేశంపై విషం చిమ్ముతున్నారు
నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న ప్లాట్ ఫామ్స్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A ప్రకారం చర్యలు తీసుకున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దేశ సార్వభౌమత్వానికి విరుద్ధంగా ఇంటర్నెట్లో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. కరోనాకు సంబంధించిన తప్పుడు వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయన్నారు.
కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ను మార్చి 31, 2020న ఏర్పాటు చేశామని, దీనిలో ప్రజలు వెరిఫికేషన్ కోసం కోవిడ్కు సంబంధించిన సమాచారాన్ని రిఫర్ చేయవచ్చని చెప్పారు. కోవిడ్-19కి సంబంధించిన ప్రశ్నలతో సహా 34,125 యాక్షన్ ప్రశ్నలకు యూనిట్ సమాధానమిచ్చిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పిఐబి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేక్ న్యూస్, 875 పోస్ట్లను కూడా ఛేదించిందని మంత్రి తెలియజేశారు.
సోషల్ మీడియాలో భారత్ కు వ్యతిరేక ప్రచారం
ఏప్రిల్లో కూడా ఐటీ మంత్రిత్వ శాఖ ఇదే తరహాలో 22 యూట్యూబ్ ఛానెల్లు, మూడు ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్బుక్ ఖాతా, ఒక వార్తా వెబ్సైట్ను బ్లాక్ చేసింది. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్కు 260 కోట్లకు పైగా వీక్షకులు ఉన్నారు, ఇది నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఉపయోగించబడుతోంది. ఈ ఛానెల్ ద్వారా దేశ వ్యతిరేక ఎజెండా అమలు చేయబడుతోంది. సున్నితమైన కంటెంట్ ప్రచురించబడింది.
అదేవిధంగా.. జనవరిలో పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్లపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. దీంతో పాటు రెండు వెబ్సైట్లను కూడా బ్లాక్ చేసింది. ఈ ప్లాట్ఫారమ్ల ద్వారా భారత వ్యతిరేక ప్రచారం జరుగుతున్నందున ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకోబడింది.