Asianet News TeluguAsianet News Telugu

యూపీలో మ‌రో ఘోరం.. అనుమానంతో భార్యను చంపి, మృతదేహాన్ని ముక్కలుగా న‌రికాడు.. !

Gulariha: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా రాంపూర్ కలాన్ పరిధిలోని గులారిహాలో నవంబర్ 8న జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, ఈ కేసులో ప్రధాన నిందితులు పంకజ్ మౌర్య, దుర్జన్ పాసిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Another tragedy in Uttar Pradesh; Man kills wife on suspicion, chops body into pieces
Author
First Published Nov 24, 2022, 3:59 AM IST

Uttar Pradesh-Murder: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భయంకరమైన శ్రద్ధా వాకర్ హత్య కేసు నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అలాంటిదే మరొక ఘోర ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మృతదేహాన్ని నరికి సుదూర ప్రదేశంలో పడవేసారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమానంతోనే త‌న భార్య‌ను చంపిన‌ట్టు నిందితుడైన భ‌ర్త తెలిపిన‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా రాంపూర్ కలాన్ పరిధిలోని గులారిహాలో నవంబర్ 8న జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, ఈ కేసులో ప్రధాన నిందితులు పంకజ్ మౌర్య, దుర్జన్ పాసిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీతాపూర్ లోని రాంపూర్ కలాన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని గులారిహాలో మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ నిందితుల్లో ఒకరైన పంకజ్ మౌర్య భార్య అని తెలిపారు. "నిందితుడు పంకజ్ మౌర్య తన సహచరుల్లో ఒకరితో కలిసి తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు" అని సీతాపూర్ పోలీసులు తన వాంగ్మూలంలో వెల్లడించారు.

జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ క్రమం తప్పకుండా మాదకద్రవ్యాలు తీసుకునేదని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. "ఆమె చాలా రోజులు ఒకరి ఇంట్లో ఉండేది, దాని వల్ల వారి సంబంధం చెడిపోయింది" అని నిందితుడు పంకజ్ చెప్పాడు. పంకజ్ మౌర్యగా గుర్తించిన నిందితుడు జ్యోతిని పదేళ్ల కింద‌ట‌ వివాహం చేసుకున్నారు. అయితే, జ్యోతి తనను మోసం చేస్తోందనే అనుమానంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు సీతాపూర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు పేర్కొన్నాడు. ఈ నేరానికి సహకరించినందుకు పంకజ్ స్నేహితుడిని కూడా అరెస్టు చేసినట్లు సీతాపూర్ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్), రాంపూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన నిఘా అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రద్ధా హత్యలాగే మ‌రో ఘ‌ట‌న..

శ్రద్ధా హత్య కేసులాంటి మ‌రో ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చింది. ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని చంపి, బావిలో పడవేసే ముందు ఆరు భాగాలుగా మృత‌దేహాన్ని నరికాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఒక నాటు తుపాకీతో నిందితుడు ప్రిన్స్ యాద‌వ్ పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో యాదవ్ కు బెల్లెట్ గాయం అయింద‌ని పోలీసులు తెలిపారు. మహిళ ఇత‌ర శ‌రీర భాగాల‌ను స్వాధీనం చేసుకునేందుకు ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 15న పశ్చిమి గ్రామ శివారులో ఉన్న బావిలో ఛిద్రమైన శవాన్ని స్థానికులు కొందరు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి మృతదేహం అర్ధనగ్న స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios