Asianet News TeluguAsianet News Telugu

రాజస్తాన్‌లో మరో దళిత బాలుడిపై టీచర్ దాడి.. హాస్పిటల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్

రాజస్తాన్‌లో ఓ చిన్నారి కుండలో నీళ్లు తాగాడని చితకబాదిన ఘటన మరువక ముందే మరో ఘటన అలాంటిదే చోటుచేసుకుంది. ఓ దళిత బాలుడిని టీచర్ కొట్టిన ఘటన బర్మార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది.

another dalit boy beaten up by teacher in rajasthan
Author
First Published Aug 24, 2022, 7:24 PM IST

జైపూర్: రాజస్తాన్‌లో ఓ దళిత బాలుడిపై జరిగిన దాష్టీకాన్ని మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన కూడా రాజస్తాన్‌లోనే జరగడం గమనార్హం. ఓ స్కూల్‌లో దళిత బాలుడిపై విద్యార్థి దాడి చేశాడు. ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారిని టీచర్ కొట్టాడు. గోడకేసి గుద్దినట్టూ బాధిత బాలుడి సోదరుడు చెప్పాడు. రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బర్మార్‌లోని స్కూల్‌లో విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఆ టెస్టుకు హాజరైన దళిత విద్యార్థి ఓ ప్రశ్నకు సమాధానం రాయలేదు. దీంతో ఆ విద్యార్థిని టీచర్ చితకబాదినట్టు అదే తరగతిలో చదువుతున్న బాధిత విద్యార్థి సోదరుడు చెప్పాడు. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాలతోనే సదరు విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థి అప్పటికే స్పృహ కోల్పోయాడు.

తల్లిదండ్రులు వెంటనే ఆ బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. టీచర్ అశోక్ మాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై ప్రశ్నిస్తున్నారు.

టీచర్ అశోక్ మాలి జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడాడు. విద్యార్థులకు తాము టెస్టు పెట్టామని, ఆ సమయంలో ఓ విద్యార్థి తన దగ్గరకు ఉరికి వచ్చాడని, తన సోదరుడిని కొందరు కొట్టారని తనకు చెప్పాడని వివరించాడు. తనను ఆ విద్యార్థి వెంట తీసుకెళ్లాడని చెప్పాడు. గాయపడిన విద్యార్థిని వెంట తీసుకుని వచ్చి, నీరు, ఆహారం అందించానని తెలిపాడు. తన సోదరుడు కూడా ఓ టాబ్లెట్ తెస్తే తాను ఇచ్చానని వివరించాడు. ఆ మెడిసిన్ గురించి పిల్లాడిని అడుగుతూనే వారి ఇంటికి ఫోన్ చేస్తే వారు లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. ఆ తర్వాత బాలుడు తన సోదరుడితో కలిసి వెళ్లిపోయాడని వివరించాడు.

ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యుడు దిలీప్ చౌదరి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios