Asianet News TeluguAsianet News Telugu

టీమ్ వర్క్ మాత్రం ఇలా ఉండకూడదు.. కళ్లు తెరిపించే పక్షుల వీడియో.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్ 

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా చురుక ఉంటారని విషయం అందరికీ తెలుసు. ఆయన నిత్యం ఏదోక వీడియోనో..  ఫోటోనో ట్విట్టర్ గూట్లో పోస్టు చేస్తు ఉంటారు. తాజాగా టీం వర్క్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.  

Anand Mahindra shares post on teamwork, Twitter reacts. Watch
Author
First Published Nov 24, 2022, 5:31 PM IST

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో ఊహించడం చాలా కష్టం.  నెటిజన్ల మనసుకు ఎదైనా నచ్చితే.. ఆ వీడియో గానీ, ఫోటో గానీ నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. అందులో పెద్దగా విషయం ఉండాల్సిన అవసరం కూడా అవసరం లేదు. తాజాగా  ఓ చిన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో రెండు పక్షులు ఎంతో ఉత్సాహంతో తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి.

అయితే.. ఓ పక్షి  మట్టిని తవ్వి వేగంగా బయటకు తీసుంటే.. మరొక పక్షి దాని వెనుకల ఉండి..  అంతే వేగంగా ఆ గుంతను పూడ్చే పనిలో ప్రపంచాన్ని మరిచి నిమగ్నమైంది. ఈ జంట పక్షుల వింత వ్యవహరాన్ని చూసి..  నెటిజన్లు తెగ నవ్వు కుంటున్నారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోపై నెట్టింట్లో కామెంట్ల వర్షం కురుస్తుంది.  

ఈ వీడియోను చూస్తే.. యుద్దాన్ని ఒంటరిగా గెలవలేమనే మాట కరెక్ట్ గా సెట్ అవుతుంది.  ఏ పనైనా కలిసి చేస్తే చాలా తేలిగా పూర్తి అవుతుంది. కానీ వైరల్ వీడియో చూస్తుంటే వన్ టూ ఫార్ములా బరువెక్కినట్లుంది. ఇద్దరి ఉద్దేశం ఒక్కటే అయినప్పుడే కలసి పని చేస్తే విజయం సాధించవచ్చని వీడియో చూశాక అర్థమవుతుంది.ఏదైనా పనిని పూర్తి చేయాలంటే.. సరైన టీమ్‌వర్క్, టీమ్ మెంబర్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఇక్కడ ఉన్న రెండు పక్షులు టీమ్‌వర్క్‌ చేయడం లేదని వైరల్ వీడియో సూచిస్తుంది.

తాజాగా ఈ వీడియోను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వీడియోలో పక్షులను చూస్తుంటే.. అవి పూర్తి వ్యూహంతోనే పనిలో నిమగ్నమై ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ.. అసలూ వాటి స్ట్రాటజీ ఒకటేనా? వీడియో చూశాక అలా అనిపించడం లేదే..  టీమ్ వర్క్ అంటే ఇలా ఉండకూడదు అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘‘ కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు మధ్యలో మీరు ఇలా చేస్తున్నట్టు ఉంటుంది. కానీ, మీరంతా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నది గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కోన్నారు. 

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు వేలాది మంది నెటిజన్లు వీక్షణించారు. ఈ వీడియోపై నెట్టిజన్లు తమదైన శైలిలో అనేక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో నిజంగా ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్ ..  ఇండియన్ రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని పేరు పెట్టారు. ఆమె కోసం పనిచేస్తున్నాడని అతను భావిస్తున్నాడని, అతని కోసం పనిచేస్తున్నానని ఆమె భావిస్తుంది. కానీ.. తీరా చూస్తే వారి పనిలో పొందన లేదని ఒక వినియోగదారు రాశారు. మొత్తం మీద ఈ  ఫన్నీ వీడియో మాత్రం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు.  

]

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా చురుక ఉంటారు.నిత్యం ఎదోక వీడియోనో.. ఎదోక  ఫోటోనో ట్విట్టర్ గూట్లో పోస్టు చేశారు. అవేవీ కాలక్షేపం కబుర్లు మాత్రం కావు. సమాచారం, విజ్ఞానం, వినోదంతో కూడి ఉంటాయి. పెద్దగా ఎవరికీ తెలియని విషయాలు, ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. దీంతో ఆయనను నెట్టింట్లో చాలా మంది ఫాలో అవుతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios