Asianet News TeluguAsianet News Telugu

ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్... నెటిజన్లను ఆకట్టుకుంటున్న పోస్ట్...!

తనకు ఆసక్తిగా అనిపించిన విషయాలతో పాటు... తన ఫాలోవర్స్ ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా  ఆయన ట్వీట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా..... ఈ రోజు మండే మోటివేషనల్ ట్వీట్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Anand mahindra monday Motivation post
Author
First Published Nov 28, 2022, 11:22 AM IST


ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వ్యాపారవేత్తగానే కాదు... సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు.. సోషల్ మీడియాలో తనకు నచ్చిన విషయాలను ఆయన షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా.... తనకు ఆసక్తిగా అనిపించిన విషయాలతో పాటు... తన ఫాలోవర్స్ ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా  ఆయన ట్వీట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా..... ఈ రోజు మండే మోటివేషనల్ ట్వీట్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 


ఆనంద్ మహీంద్రా మార్క్ ట్వైన్‌కి చెప్పిన ఓ కొటేషన్ ని తన ట్విట్టర్ ఎకౌంట్ లో షేర్ చేశారు. అందులో.. "మనమంతా పిచ్చివాళ్లమని గ్రహించిన క్షణం మాత్రమే జీవితం పూర్తిగా అర్థమవుతుంది." అనే కొటేషన్ ఉంది

అతను ఈ క్యాప్షన్‌తో కోట్‌ను పంచుకున్నాడు, “ప్రపంచం ఒక పిచ్చినివాసం అని, మనమందరం కొంచెం వెర్రివాళ్లమని మీలో మీరు అంగీకరిస్తే మీ ముఖంపై చిరునవ్వుతో సోమవారాల్లో మీరు పనికి వెళ్లవచ్చు. మీరు చేసే పనిలో మీరు 'వెర్రి మంచి'గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోండి!" అంటూ ట్వీట్ చేశారు. కాగా... ఆయన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios