Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన.. సీఎం, మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించారు. పర్యటనలో తొలిరోజు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు , అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్దించాలని అధికారులను ఆదేశించారు. 

Amit Shah Visits Manipur, Chairs High-Level Meeting With CM, Ministers KRJ
Author
First Published May 30, 2023, 6:11 AM IST

Amit Shah In Manipur: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం (మే 29) మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్నారు. రాష్ట్రానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ డేకా సమక్షంలో రాష్ట్రంలోని ఇతర అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి మణిపూర్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండతో తలెత్తిన పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు.

హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇంఫాల్‌లోని బిర్‌తికేంద్రజిత్ ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి . సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అమిత్ షా మంగళవారం (మే 30) అనేక సమావేశాలు నిర్వహించవచ్చని పిటిఐ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు అతను బుధవారం (మే 31) విలేకరుల సమావేశంలో కూడా ప్రసంగించవచ్చు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసను నియంత్రించడానికి తీసుకున్న చర్యలను ప్రకటించవచ్చు.

ఇప్పటివరకు 75 మందికి పైగా మృతి

మంత్రి అమిత్ షా గురువారం (జూన్ 1) ఉదయం ఇంఫాల్ నుండి తిరిగి రావచ్చని భద్రతా వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో కుల హింస చెలరేగిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో జరిగిన కుల ఘర్షణల్లో 75 మందికి పైగా మరణించారు.

సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఏం చెప్పారు?

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ కోసం భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి ఇళ్లకు నిప్పుపెట్టడం, నిందితులపై  కాల్పులు జరిపిన శాంతి పునరుద్దన జరగడం లేదని, ఇప్పటివరకూ సుమారు 40 మంది సాయుధ ఉగ్రవాదులు మరణించారని బీరెన్ సింగ్ చెప్పారు. తాజా హింసాత్మక సంఘటనల కారణంగా, జిల్లా అధికారులు ఇంఫాల్ తూర్పు మరియు పశ్చిమ జిల్లాలో 11 గంటల కర్ఫ్యూ సడలింపును కేవలం ఆరున్నర గంటలకు తగ్గించారు.

వదంతులు వ్యాపింపజేసే వారికి సీఎం వార్నింగ్

రాష్ట్రంలో కుల హింస కొనసాగుతున్న నేపథ్యంలో పుకార్లు వ్యాప్తి చేసే వారికి ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. నకిలీ వార్తలు, పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని సృష్టించడం లేదా వ్యాప్తి చేయడం వంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో లేదా ఏదైనా మాధ్యమం ద్వారా సమాచారాన్ని ప్రచురించడానికి ముందు సమాచారాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని సూచించారు.  

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 3న అల్లర్లు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జాతి ఘర్షణల్లో 80 మంది మరణించినట్లు నివేదించబడింది. సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇంఫాల్ లోయ , చుట్టుపక్కల జిల్లాల్లో ఆర్మీ , పారామిలటరీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. అక్రమ ఆయుధాలను జప్తు చేయడమే ఆర్మీ ఆపరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి , గ్రెనేడ్‌లతో  25 మంది దుండగులను భారత సైన్యం , పారామిలటరీ బలగాలు పట్టుకున్నాయని అధికారులు సోమవారం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios