Asianet News TeluguAsianet News Telugu

అలా చేస్తే.. నిత్యం మ‌ర‌ణ‌హోమం జ‌రుగుతుంద‌న్నారు.. కానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి 

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, అవినీతిని అంతం చేసి, సర్వతోముఖాభివృద్ధిని తీసుకురావాలని, ఈ ప్రాంతాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని హోంమంత్రి అమిత్‌షా అన్నారు. 

Amit Shah No One Dares To Indulge In Stone-Pelting In Jammu And Kashmir Now
Author
First Published Oct 5, 2022, 6:23 AM IST

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం కార‌ణంగా 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే..  ఇప్పుడూ హర్తాళ్‌కు పిలుపునిచ్చేందుకు లేదా రాళ్లదాడికి పాల్పడడానికి ఎవరూ సాహసించనంతగా భద్రతా పరిస్థితి మెరుగుపడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తెలిపారు. ఉగ్రవాదం, అవినీతిని అంతం చేసి, సర్వతోముఖాభివృద్ధిని తీసుకురావాలని, జమ్మూకశ్మీర్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని షా అన్నారు.

ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నామని, పరిస్థితిపై భద్రతా బలగాల పూర్తి నియంత్రణను నిర్ధారిస్తున్నామని అన్నారు. జ‌మ్మూకాశ్మీర్ ప‌ర్య‌ట‌న లో భాగంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వంలో కూర్చుని ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో హర్తాళ్‌కు పిలుపునిచ్చే వారిని లేదా భద్రతా బలగాలపై రాళ్లు రువ్వేవారిని, కానీ ప‌రిస్థితి మారింద‌నీ, ఆ ప‌రిణామాల‌ను పూర్తిగా అరికట్టామని, ఇప్పుడు అలాంటి అసాంఘిక చ‌ర్య‌కు పిలుపునిచ్చే ధైర్యం ఎవరికీ లేదని ఆయన అన్నారు.  ఉగ్రవాదులకు లొంగిపోయే అవకాశం ఇచ్చినందున ఇప్పుడు ఒక్క ఎన్‌కౌంటర్ కూడా జరగలేదన్నారు.

ఉగ్రవాద ఘటనలు 56 శాతం తగ్గాయని, భద్రతా బలగాల మరణాలు 84 శాతం తగ్గాయని షా చెప్పారు. టెర్రర్ క్యాడర్‌గా రిక్రూట్‌మెంట్ కూడా తగ్గిందని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ వెనుకబాటుకి  ఆ మూడు రాజకీయ కుటుంబాలను కార‌ణ‌మ‌ని,  వారి దుష్పరిపాలన కారణంగా UT అన్ని అభివృద్ధి పారామితులలో వెనుకబడి ఉందని అన్నారు. కానీ 2014 తర్వాత మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పరిస్థితి మారిపోయిందని, ప్రస్తుతం అది బాగా పురోగమిస్తోందని ఆయన అన్నారు.  

ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-A రద్దు చేయబడినప్పటి.. జ‌మ్మూ కాశ్మీర్ లో పెద్ద మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2019 వరకు జమ్మూ కాశ్మీర్‌కు కేవలం ₹ 19,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని హోం మంత్రి చెప్పారు. కానీ 2019 తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు ₹ 56,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లోని 27 లక్షల మంది ప్రజలు ఇప్పుడు ₹ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందుతున్నారని, 58 శాతం మంది ప్రజలు తమ ఇళ్లలో పైపుల ద్వారా నీటిని పొందుతున్నారని ఆయన అన్నారు. అర్హులైన వారికి కూడా ఎస్టీ కోటా ప్రయోజనాలు లభిస్తున్నామ‌ని తెలిపారు.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ₹ 80,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రస్తావించారు , ప్రాజెక్టులు బాగా అభివృద్ధి చెందుతున్నాయని, కొన్ని ఇప్పటికే పూర్తిగా అమలు చేయబడ్డాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో 15 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 63 ప్రాజెక్టులను ₹ 80,068 కోట్ల వ్యయంతో నిర్మించిన‌ట్టు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios