Asianet News TeluguAsianet News Telugu

అప్రమత్తమైన భారత వైమానిక దళం .. రాఫెల్,సుఖోయ్ యుద్ద విమానాలతో విన్యాసాలు

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా తాజా దురాక్రమణకు పాల్పడింది. డిసెంబరు 9న తవాంగ్‌ సెక్టారు యాంగ్‌ట్సె ప్రాంతంలో 300-400 మందికి పైగా చైనా సైనికులు మేకులు కొట్టిన, ఇనుప ముళ్ల కంచెలు చుట్టిన కర్రలను, టీజర్‌ గన్‌లను తీసుకొని భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఈ తరుణంలో అప్రమత్తమైన భారత సైన్యం డ్రాగన్ సైన్యాన్ని తిప్పికొట్టింది. ఈ క్రమంలో  డిసెంబరు 15, 16 తేదీల్లో వైమానిక దళం రెండు రోజుల పాటు విన్యాసాలు చేయనున్నది.

Amid India- China clash, IAF to carry out training exercise in eastern sector to check readiness of aircraft
Author
First Published Dec 14, 2022, 1:02 PM IST

భారత వైమానిక దళం వ్యాయామం: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య వాగ్వివాదం తరువాత భారత వైమానిక దళం అప్రమత్తమైంది. తవాంగ్ యాంగ్ట్సే వాగ్వివాదం మధ్య భారత వైమానిక దళం యొక్క తూర్పు కమాండ్ గురువారం (డిసెంబర్ 15) నుండి రెండు రోజుల పాటు విన్యాసాలు చేయనుంది. డిసెంబరు 15, 16 తేదీల్లో వైమానిక దళం రెండు రోజుల పాటు వ్యాయామం నిర్వహించనుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అన్ని ఈశాన్య రాష్ట్రాల గగనతలంలో వైమానిక దళం విన్యాసాలు చేయనున్నది. ఈ మేరకు వైమానిక దళం నోటీసులు జారీ చేసింది.

వాయుసేన విన్యాసాలు

భారత వైమానిక దళం అప్రమత్తమైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హషిమారా మరియు కలైకుండ, అస్సాంలోని తేజ్‌పూర్,ఝబువా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అడ్వాన్స్ ల్యాండింగ్ స్ట్రిప్ పాల్గొంటున్నాయి.ఈ విన్యాసాలల్లో రాఫెల్ యుద్ధ విమానాలు కూడా పాల్గొంటాయి. ఇది కాకుండా.. సుఖోయ్,అనేక హెలికాప్టర్లు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. 
వార్తా సంస్థ ఏఎన్ఐ  వెల్లడించిన నివేదిక ప్రకారం.. తేజ్‌పూర్, ఛబువా, అస్సాంలోని జోర్హాట్,పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా చుట్టుపక్కల ప్రాంతాలలో భారత వైమానిక దళం(IAF)స్థావరాల క్రియాశీలతను తనిఖీ చేయడానికి ఈ వారంలో విన్యాసాలు చేయనున్నది. ఈ విన్యాసాలు చాలా కాలం క్రితమే జరగాల్సి ఉందని, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు ఎలాంటి సంబంధం లేదని మీడియా వర్గాలు స్పష్టం చేశాయి.

తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణ 

తూర్పు లడఖ్‌లో భారత్, చైనాల మధ్య గత రెండున్నరేండ్లుగా సరిహద్దు వెంబడి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత శుక్రవారం అంటే డిసెంబర్ 9న సున్నితమైన ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) సమీపంలోని యాంగ్సే సమీపంలో ఘర్షణ జరిగింది. డిసెంబర్ 9న 300-400 చైనా సైనికులు యాంగ్ట్సే శిఖరాన్ని అధిరోహించడం ద్వారా భారతీయ సైనికులను తొలగించడానికి ప్రయత్నించారు. కానీ, ఈ విషయం తెలుసుకున్న భారతీయ సైనికులు అప్పటికే అప్రమత్తమయ్యారు. భారత సైన్యం చైనా సైనికులను తరిమికొట్టింది.

ధీటుగా సమాధానమిచ్చిన భారత సైనికులు

యాంగ్జీ ప్రాంతంలో LACని ఆక్రమించడం ద్వారా యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా దళాలు (PLA) ప్రయత్నించాయని, అయితే చైనా చేసిన ఈ ప్రయత్నాన్ని భారత దళాలు పూర్తిగా తిప్పికొట్టాయని భారత ప్రభుత్వం చెబుతోంది. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios