Asianet News TeluguAsianet News Telugu

అంబులెన్స్ లో వ్యక్తికి కరోనా.. చెరుకు రసం కోసం వచ్చిన డ్రైవర్...

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో పలు  రాష్ట్రాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నిబంధనల్ని కఠినం చేస్తున్నాయి. మరీ తీవ్రత ఎక్కువున్న ప్రాంతాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని చోట్ల కర్ప్యూలు పెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ambulance with covid patient stops at juice shop in madya pradesh - bsb
Author
Hyderabad, First Published Apr 9, 2021, 7:56 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో పలు  రాష్ట్రాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నిబంధనల్ని కఠినం చేస్తున్నాయి. మరీ తీవ్రత ఎక్కువున్న ప్రాంతాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని చోట్ల కర్ప్యూలు పెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

అయితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజల్లో నిర్లక్ష్యం పోలేదు. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా లాభం లేకుండా పోతోంది. 

కరోనా అంటే జనాల్లో భయంలేదు. వ్యక్తిగత శుభ్రత, శానిటైజర్ వాడకం, మాస్క్ ధరించడం వాటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వైరస్ ను చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నారు. సామాన్యులే అనుకుంటే జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్య సిబ్బంది కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా కోవిడ్ రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి వచ్చి చెరుకురసం ఆర్డర్ చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే అంబులెన్స్ లో ఉన్న వ్యక్తికి కోవిడ్.. నాకు కాదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది ఆ వివరాలు...

రాష్ట్రంలోని షాడోల్ జిల్లాలో సదరు అంబులెన్స్ సిబ్బంది కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తికి టెస్టులు చేయించడం కోసం రాజేంద్ర టాకీస్ స్క్వయర్‌ సెంటర్‌లోని ప్రైవేట్‌ ల్యాబ్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న ఓ చెరకు రసం బండి దగ్గర వాహనాన్ని ఆపి..
దాంట్లో నుంచి పీపీఈ కిట్లు ధరించిన అంబులెన్స్ డ్రైవర్ కిందికి దిగి చెరకురసం బండి సమీపానికి వచ్చి.. చెరుకు రసం కావాలంటూ ఆర్డర్ ఇచ్చాడు.

దీని గురించి అక్కడున్న వారు అభ్యంతరం వ్యక్తం చేయగా అంబులెన్స్ లో ఉన్న వ్యక్తికి కరోనా.. నాకు కాదు.. అంటూ డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు .ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చెయగా తెగ వైరలయింది. 

ఇక సదరు అంబులెన్స్ ని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెందినదిగా గుర్తించారు. మధ్యప్రదేశ్లో కోవిడ్ విజృంభిస్తుండడంతో పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం (ఏప్రిల్‌ 14, 2021) ఉదయం 6 గంటల వరకు సుమారు 60 గంటల పాటు లాక్డౌన్ విధించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios