భారత గగనతలంలో అసహ్యకరమైన సంఘటనల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. యాంకాక్-కోల్‌కతా థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య భీకర పోరు జరిగింది. ఇందుకు సంబంధించిన సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బ్యాంకాక్ టు ఇండియా ఫ్లైట్: భారత గగనతలంలో అసహ్యకరమైన సంఘటనల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న థాయ్ స్మైల్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య భీకర పోరు జరిగింది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు పోట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. తాజా ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తుంటే విమానాల్లో కూడా నేరాల ఘటనలు నిరంతరంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఘటన మంగళవారం (డిసెంబర్ 27)చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వైరల్ అవుతున్న వీడియో

ఈ సంఘటన యొక్క వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వాదించుకోవడం చూడవచ్చు.అదే సమయంలో ఓ ఎయిర్ హోస్టర్ ఆ పరిస్థితిని సద్దుమణిగేలా ప్రయత్నించింది. కానీ.. తనతో వల్ల కాలేదు. ఆ ఇద్దరూ ప్రయాణీకుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త.. దాడికి దారి తీసింది. ఒక ప్రయాణీకుడు తన కళ్లద్దాలను తీసివేసి మరొక ప్రయాణికుడిని కొట్టడం ప్రారంభించడాన్ని వీడియో చూపిస్తుంది, అతని స్నేహితులు కూడా ఘర్షణలో పాల్గొన్నారు. అవతలి వ్యక్తి వారిని తిరిగి కొట్టలేదు. తనపై జరిగిన దాడిని తగ్గించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. విమాన సహాయకురాలు ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నిస్తుంది. సహ-ప్రయాణికులు, విమాన సహాయకులు గొడవను ఆపాలని, శాంతించమని కోరడం వినవచ్చు.

Scroll to load tweet…

ఇండిగో విమానంలో వివాదం.. వీడియో వైరల్‌..

ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది, డిసెంబర్ 16 న ఇస్తాంబుల్ నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు, ఫ్లైట్ అటెండెంట్ మధ్య తీవ్రమైన వాదన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వైరల్ వీడియోపై జనాలు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో.. కొంతమంది వినియోగదారులు వ్యాఖ్యలలో వివిధ విషయాలు చెప్పారు, మరికొందరు క్యాబిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేశారు. ఈ సంఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. "మేము ఈ సంఘటనను పరిశీలిస్తున్నామని, కస్టమర్ సౌలభ్యం ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత అని హామీ ఇవ్వాలనుకుంటున్నాము" అని తెలిపింది.