Syed Mohammad Rabe Hasani Nadvi: ముస్లింల అత్యంత శక్తివంతమైన సంస్థ అయిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ మౌలానా రబే హస్నీ నద్వీ గురువారం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో గత కొంతకాలంగా నద్వీ (94) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Syed Mohammad Rabe Hasani Nadvi: ముస్లింల అత్యంత శక్తివంతమైన సంస్థ అయిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అధ్యక్షుడు హజ్రత్ మౌలానా రబే హసానీ నద్వీ గురువారం (ఏప్రిల్ 13) మరణించారు. మౌలానా రబే హస్నీ నద్వీ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలు బాధించడంతో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ను చికిత్స నిమిత్తం రాయ్బరేలీ నుంచి లక్నో తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్నోలోని దాలిగంజ్లోని నడ్వా మదర్సాలో తుది శ్వాస విడిచారు. ఆయన ఏ విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం వెల్లడించేవారు. మతపరమైన అంశాల్లో సమాజానికి మార్గదర్శనం చేసేవారు.
మౌలానా రబే హసనీ నద్వీ .. భారతీయ ఇస్లామిక్ పండితుడు, ఆయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ , లక్నోకు చెందిన నద్వతుల్ ఉలేమా - మతపరమైన విద్యలో ముఖ్యమైన కేంద్రం. అతను ముస్లిం వరల్డ్ లీగ్ వ్యవస్థాపక సభ్యుడు, రియాద్ (KSA) అల్మీ రబితా అదాబ్-ఎ-ఇస్లామీ వైస్ ప్రెసిడెంట్ కూడా. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 500 మంది ముస్లింలలో ఆయన ఒకరు.
మౌలానా రబే హస్నీ నద్వీ 1 అక్టోబర్ 1929న UPలోని రాయ్ బరేలీలో జన్మించారు. నద్వీ తన ప్రాథమిక విద్యను రాయ్ బరేలీలో అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమాలో చేరాడు. 1949లో చదువు పూర్తయిన తర్వాత దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలేమాలో అసిస్టెంట్ టీచర్గా నియమితులయ్యారు. 1993లో దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలేమా ముహత్మీమ్ (వైస్ ఛాన్సలర్)గా నియమితులయ్యారు. 1999లో నద్వా ఛాన్సలర్గా నియమితులయ్యారు.
జూన్ 2002లో హైదరాబాద్లో హజ్రత్ మౌలానా ఖాజీ ముజాహిదుల్ ఇస్లాం ఖాస్మీ (రహమతుల్లా అలీ) మరణించిన తర్వాత, ఆయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అరబిక్ భాషా రంగంలో ఆయన చేసిన కృషికి గానూ రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. ముస్లింలు ఇస్లాం మతాన్ని కేవలం నమాజ్కే పరిమితం చేశారని, సామాజిక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన పలు సందర్భాల్లో విచారం వ్యక్తం చేశారు. ఇస్లాం కేవలం ప్రార్థనకే పరిమితం కాకూడదని సూచించారు. కాగా, ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
