Akhilesh Yadav: బీజేపీ పై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారోద్యమం ద్వారా బిజెపి- ఆర్ఎస్ఎస్లు తమ గతపు "చీకటి పేజీలను" దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Akhilesh Yadav: 'హర్ ఘర్ తిరంగా' ప్రచారోద్యమం ద్వారా బిజెపి- ఆర్ఎస్ఎస్లు తమ గతపు "చీకటి పేజీలను" దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పవిత్రతను ధ్వంసం చేసేందుకు బీజేపీ నరకయాతన పడిందని ఆరోపించారు .
చాలా చోట్ల బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాను అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ, త్రివర్ణ పతాకం కోట్లాది మంది భారతీయులకు గర్వకారణమన్నారు. అయితే.. బీజేపీ మాత్రం జెండాను అంగడి సరుకుగా భావిస్తుందనీ, ప్రతిదానికీ బీజేపీ దుకాణాలు పెట్టడం మానేయాలని విమర్శించారు. జాతీయ జెండా గర్వంతో ఆడుకోవడం సిగ్గుచేటని, ఖండించదగినదని యాదవ్ అన్నారు.
ప్రజల ఒత్తిడి, స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ- ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా తమ గత కాలపు ‘చీకటి పేజీలను’ దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అధికార బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని అంగీకరించలేదని ఆరోపించారు.
స్వాతంత్య్ర సమరంలో ఆర్ఎస్ఎస్ బ్రిటీష్కు అండగా నిలిచిందని ఆరోపించారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు ఇంటింటికి త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహించడం ద్వారా పార్టీ స్వాతంత్య్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిందని అన్నారు.
‘బీజేపీ కార్యాలయాలు త్రివర్ణ దుకాణాలుగా మారాయి...బీజేపీ జెండాలపై ఎంత జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందో చెప్పాలి’ అని ప్రశ్నించారు. అతను తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి జాతీయ జెండాను విక్రయించిన వీడియోను కూడా జత చేశాడు.
సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్లో 207 అడుగుల ఎత్తైన స్తంభంపై పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పోలీసు సిబ్బందికి సెల్యూట్ చేసే పద్ధతి ఉందని యాదవ్ ఆరోపించారు. బీజేపీపై విమర్శలు గుప్పించిన యాదవ్.. కొన్ని చోట్ల బీజేపీ నేతలు జెండాను తలకిందులుగా పట్టుకుని ఫొటోలు తీశారని ఆరోపించారు.
