NCPCR: ప్రభుత్వం నిషేధించిన పబ్జీ గేమ్‌ పిల్లలకు ఇంకా ఎలా అందుబాటులో ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR) కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కారణాలు ఏంటో తెలపాలని కోరింది. ఈ మేరకు కేంద్ర IT మంత్రిత్వ శాఖకు కమిషన్‌ లేఖ రాసింది.   

NCPCR: ఇటీవల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లక్నోలో ఆన్‌లైన్ గేమ్ PUBG ఆడకుండా ఆపినందుకు ఒక యువకుడు తన తల్లిని చంపాడు. ఈ ఘ‌టన  దేశవ్యాప్తంగా ఇప్పుడూ చర్చ‌నీయమైంది. పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నను అంత‌గా ప్ర‌భావితం చేస్తున్న ఆన్లైన్ గేమ్ ల కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆరా తీసింది. అస‌లు నిషేధించ‌బ‌డిన ఆన్ లైన్ గేమ్ PUBG ని ఎలా ఆడుతున్నార‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. ఇందుకు గ‌ల  కారణాలు ఏంటో తెలపాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) .. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఫండ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. నిషేధం తర్వాత కూడా PUBG గేమ్‌ను విడుదల చేయడంపై NCPCR ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఇట‌వ‌ల లక్నోలో PUBG ఆడకుండా ఆపినందుకు ఓ యువకుడు తన తల్లిని చంపిన ఉదంతంతో.. గ‌తంలో దేశ‌వ్యాప్తంగా నిషేధించిన PUBG గేమ్ తెరపైకి వచ్చింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) దీనిని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఎన్సీపీసీఆర్ ప్రెసిడెంట్ ప్రియాంక్ కనుంగో మంగళవారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. PUBG వంటి ఆన్‌లైన్ గేమ్‌లపై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత కూడా దేశంలో  పిల్లలు వాటిని ఆడటం పట్ల NCPCR అధ్యక్షుడు ప్రియాంక్ కనుంగో లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ లేఖలో ఈ నిషేధిత ఆన్‌లైన్ గేమ్‌లు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండటానికి కారణమేమిటో వివ‌ర‌ణ కోరింది. అలాగే.. నిషేధం విధించిన కూడా ప్ర‌స్తుతం క్రియాశీల‌కంగా ఉన్న ఆన్‌లైన్ గేమ్‌ల జాబితాను 10 రోజుల్లో ఇవ్వాల‌ని కోరారు.

పబ్‌జీపై నిషేధం 

2020లో చైనా సైన్యంతో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత భార‌త‌ ప్రభుత్వం ప్రముఖ గేమింగ్ యాప్ PUBGతో పాటు 118 మొబైల్ యాప్‌లను నిషేధించింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు రక్షణకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. నిషేధించబడిన మొబైల్ యాప్‌ల జాబితాలో PUBG పేరు కూడా చేర్చబడింది. ఆ సమయంలో దేశంలో పెద్ద సంఖ్యలో యువ‌త‌ ఈ ఆన్‌లైన్ గేమ్ ను ఆడుతున్నారు. ఈ గేమ్ కు పెద్ద సంఖ్యలో యువత బానిసల‌య్యారు.ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత.. దేశవ్యాప్తంగా PUBG వంటి ఆన్‌లైన్ గేమ్‌లకు ఉన్న క్రేజ్ కూడా అంతరించిపోతుందని భావించారు. అయితే గతంలో లక్నోలో జరిగిన సంఘటన తరువాత PUBG గురించి మరోసారి వివాదం ప్రారంభమైంది.