బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని స్థానికులు తీవ్రంగా హింసించడంతో పాటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని స్థానికులు తీవ్రంగా హింసించడంతో పాటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. అతనిని చితక బాదటమే కాకుండా, బలవంతంగా మలం తినిపించారు .
వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ రాష్ట్రం ధోల్పూర్కు చెందిన దీపక్ అనే వ్యక్తి కొన్ని వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్ 25వ తేదీన దీపక్పై ఎనిమిది మంది దాడికి పాల్పడ్డారు.
పిడిగుద్దులు కురిపించడంతో పాటు చేతికి ఏది దొరికితే దానితో విచక్షణా రహితంగా చితకబాది, అతడి చేత మలం తినిపించారు. ఈ అమానుషకాండపై దీపక్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా బాలిక కుటుంబం గతంలోనే అతడిపై ఫిర్యాదు చేసిందని, దానిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 29, 2020, 6:23 PM IST