సిఈసీతో ముగిసిన విపక్షాల భేటీ
వీవీ ప్యాట్ల లెక్కింపు అంశంపై తాము చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సంఘ్వీ స్పష్టం చేశారు. తాము లేవెనెత్తిన అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఢిల్లీ: వీవీ ప్యాట్ల లెక్కింపు అంశంపై తాము చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సంఘ్వీ స్పష్టం చేశారు. తాము లేవెనెత్తిన అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు అభిషేక్ మను సంఘ్వీ, ఫరూక్ అబ్దుల్లా, సుజనా చౌదరి, సీఎం రమేష్ లు సునీల్ అరోరాను కలిసిన వారిలో ఉన్నారు.