వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. అగ్నిపథ్ పథకంపై వారు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ ఆస్తికర పరిణామం మంగళవారం ట్విట్టర్ వేదికగా చోటు చేసుకుంది. ఎవరా నాయకులు, ఏం జరిగింది ? తెలియాలంటే ఇది చదివేయండి..
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అగ్నిపథ్ పథకంపై ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అగ్నిపథ్ సంస్కరణను విస్తృత జాతీయ ప్రయోజనాల కోసం రూపొందించారని మనీష్ తివారీ పేర్కొనగా.. జైరాం రమేష్ దీనిని జాతీ వ్యతిరేక భద్రత, యువ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ట్విట్టర్ లో ఈ ఆసక్తికరమైన పరిణామం మంగళవారం చోటు చేసుకుంది.
త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఈ అగ్నిపథ్ స్కీమ్ ను సమర్థిస్తూ మనీష్ తివారీ ఓ పత్రికకు ఆర్టికల్ రాశారు. దీనిపై జైరాం రమేష్ స్పందించారు. “మనీష్ తివారీ అగ్నిపథ్పై ఒక వ్యాసం రాశారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్య పార్టీ. అయినప్పటికీ ఆయన ఆర్టికల్ రాసిన అభిప్రాయాలు పూర్తిగా అతడి వ్యక్తిగతం. అవి పార్టీ అభిప్రాయాలు కావు అని చెప్పాలి. అగ్నిపథ్ దేశ భద్రత, యువతకు వ్యతిరేకమని పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఈ పథకాన్ని చర్చ లేకుండా బుల్డోజ్ చేసింది.’’ అని తెలిపారు.
భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన భర్త.. మైనర్ ను బెదిరించి పెళ్లి చేసుకుని ఘాతుకం..
దీనికి తివారీ స్పందిస్తూ.. ‘‘ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని ఈ కథనం ట్యాగ్ లైనే చెబుతోంది. జైరామ్ రమేష్ చివరి వరకు చదవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇప్పుడు ఇక్కడ దానిని చూడొచ్చు ’’ అని తన ఆర్టికల్ కు సంబంధించిన క్లిప్ ట్వీట్ ద్వారా షేర్ చేశారు. ఆ క్లిప్ లో ఆర్టికల్ లోని కొంత భాగం, వ్యాసకర్త పేరు, అభిప్రాయాలు వ్యక్తిగతమైనవనే సూచన కనిపిస్తోంది.
కాగా ఈ విషయంలో మనీష్ తివారీ వార్తా సంస్థ IANSతో మాట్లాడారు. 1975లో డోనాల్డ్ రమ్స్ఫీల్డ్ ఫోర్డ్ అడ్మినిస్ట్రేషన్లో డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే మిలటరీని రైట్-సైజింగ్ చేయడంతో పాటు రక్షణ సంస్కరణల ప్రక్రియ USలో ప్రారంభమైందని అన్నారు. తరువాత అనేక దేశాలు దీనిని అనుసరించాయని అన్నారు. రక్షణ సంస్కరణ అనేది ఒక పెద్ద వ్యూహాత్మక క్షితిజంలో ఒక భాగమని అన్నారు. అంతర్గత పునర్వ్యవస్థీకరణ చర్య మాత్రమే కాదని చెప్పారు. మనీష్ తివారీ తన పుస్తకం ‘‘10 ఫ్లాష్ పాయింట్స్ 20 ఇయర్స్’’లో దేశానికి అత్యవసరంగా రక్షణ సంస్కరణలు ఎందుకు అవసరమో పేర్కొన్నారు.
చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. పోలీసులు సలాం కొడుతున్న నెటిజన్లు..
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను 1999లో కార్గిల్ రివ్యూ కమిటీ (కేఆర్సీ) సిఫారసు చేసిందని, సిఫారసులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సాయుధ దళాలతో సహా సంస్కరణలకు మద్దతు ఇచ్చిందని మనీష్ తివారీ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో తేలికైన మానవ పాదముద్రలు, అత్యాధునిక ఆయుధాలతో కూడిన యువ సాయుధ దళం భారతదేశానికి అవసరమని తివారీ గత వారమే పేర్కొన్నారు. సాయుధ బలగాలు ఉపాధి హామీ కార్యక్రమం కాకూడదని ఆయన అన్నారు.
రెండు వారాల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ అగ్నిపథ్ పథకంపై దేశంలోని పలు చోట్ల ఒక్క సారిగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అవి హింసాత్మక పరిస్థితులకు దారి తీశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. అగ్నిపథ్ మొదటి బ్యాచ్ కు మూడేళ్ల వయో పరిమితి మినాహాయింపు ఇచ్చింది. అలాగే కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 10 శాతం కోటాను కల్పించింది. అనేక రాష్ట్రాలు పోలీసు రిక్రూట్ మెంట్లలో అగ్నివీర్ లకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది.