ప్రేమికురాలిని హత్య చేసి, మృతదేహాన్ని పారేయడానికి అంబులెన్స్ ను అద్దెకు తీసుకున్న ప్రేమికుడు..
మహారాష్ట్రలోని దారుణం వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు ప్రేమికురాలిని హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని పారేయడానికి ప్లాన్ చేశాడు. అయితే పోలీసులు మధ్యలోనే అతడిని పట్టుకొని అరెస్టు చేశారు.
వారిద్దరూ ప్రేమికులు. గత కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఒక రోజు ప్రేమికురాలు ఇంటికి ఆలస్యంగా వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఆ ప్రేమికుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని ఎవరికి కనిపించకుండా పారేయడానికి అంబులెన్స్ ను కూడా అద్దెకు తీసుకున్నాడు. అయితే చివరికి పోలీసులకు చిక్కాడు.
టీచర్ కొట్టడంతో దళిత విద్యార్థి మృతి.. పోలీసుల కారుకు నిప్పుపెట్టి, రాళ్లు రువ్విన బంధువులు
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర భివండిలోని శివాజీ నగర్కు చెందిన సద్దాం, ముస్కాన్ (24)తో ప్రేమించుకున్నారు. 5 నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ముస్కాన్ బార్ గర్ల్గా పని చేస్తుండగా.. సద్దాం నిరుద్యోగి.
గత గురువారం ముస్కాన్ మద్యం సేవించి, ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్ద వాగ్వాదంగా మారింది. దీంతో కోపంతో సద్దాం ముస్కాన్ ను గొంతు నులిమి చంపేశాడు. పైగా కర్ణాటకలోని బీజాపూర్లో ఉన్న మృతురాలి అమ్మమ్మకు కాల్ చేసి.. ముస్కాన్ చనిపోయిందని, కానీ కారణం తెలియదని చెప్పాడు.
మహిళా కానిస్టేబుల్ మీద హత్యాయత్నం, న్యాయవాది జంట అరెస్ట్...
ఆ తర్వాత మృతదేహాన్ని పారేయడానికి సద్దాం అంబులెన్స్ను బుక్ చేసుకున్నాడు. ఇదే సమయంలో మృతురాలి సెల్ ఫోన్ కు ఆమె కాల్ చేసింది. ఎన్ని సార్లు కాల్ చేసిన స్పందన రాకపోవడంతో ఆమె నేరుగా ప్లాట్ కు చేరుకుంది. అయితే ముస్కాన్ మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని సద్దాం ఆమె అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడని స్థానికులు స్నేహితురాలికి తెలియజేశారు.
చండీగఢ్ యూనివర్శిటీ ఎంఎంఎస్ కుంభకోణం : నిందితురాలితో ఆర్మీ జవాన్ డేటింగ్...
ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర పాటిల్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి అంబులెన్స్ నెంబర్ ను గుర్తించారు. అనంతరం ఆ అంబులెన్స్ వెళ్లే దారిని తెలుసుకొని వెంబడించారు. నిందితుడిని పూణెలో పట్టుకున్నారు. అతడిని విచారించగా తానే నేరం చేశానని ఒప్పుకున్నాడు.