Thane: కుటుంబ కలహాల కారణంగా 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. బద్లాపూర్ ప్రాంతంలోని మంజర్లిలోని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగిందనీ, ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
Man Kills Wife After Quarrel: కుటుంబ కలహాల కారణంగా 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. బద్లాపూర్ ప్రాంతంలోని మంజర్లిలోని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగిందనీ, ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే..నిందితుడు అనుమానంతో నిత్యం భార్యతో గొడవలు చేస్తుండేవాడనీ, ఈ క్రమంలోనే సోమవారం గొడవ అనంతరం భార్య ప్రాణాలు తీశాడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. బద్లాపూర్ ప్రాంతంలోని మంజర్లిలోని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడికి, అతని 37 ఏళ్ల భార్యకు కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు జరిగేవని, ఆమె వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాడని బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పోలీసులు వారిద్దరిపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు చేశారు. సోమవారం భార్యాభర్తలు మద్యం సేవించి మళ్లీ గొడవ పడ్డారు. అనంతరం నిందితుడు ఆమెను గొంతు నులిమి చంపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత పొరుగున ఉన్న ముంబయిలో నివాసముంటున్న తన భార్య సోదరుడి ఫోన్ కు ఆమెను హత్య చేసినట్లు నిందితుడు మెసేజ్ పంపాడు. బాధితురాలి సోదరుడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో మహిళ శవమై ఉండటాన్ని గమనించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
