13 మందితో ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అది అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరి కొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగింది.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ఓ కారు టైరు పగిలిపోయింది. దీంతో అది అదుపు తప్పి బారియర్‌ను ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. కారు ప్రమాదానికి టైరు పేలడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

సేమ్ సెక్స్ మ్యారేజీని వ్యతిరేకించిన కేంద్రం.. ‘భారతీయ కుటుంబంతో పోల్చలేం’.. సుప్రీంకోర్టులో స్పష్టీకరణ

వివరాలు ఇలా ఉన్నాయి. ఔరంగాబాద్‌ నుంచి 13 మంది ప్రయాణికులతో ఓ కారు షెగావ్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై బుల్దానాలోని శివని పిసా గ్రామ సమీపంలోకి చేరుకుంది. అయితే ఒక్క సారిగా కారు టైరు పేలింది. దీంతో డ్రైవర్ కారును అదుపు చేయలేకపోవడంతో వాహనం రోడ్డుపై వేసిన బారియర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఇందులో ఓ వ్యక్తి, నలుగురు మహిళలు, ఒక యువతి ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని ఔరంగాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. 

తెలంగాణ‌, ఏపీ వాసుల‌కు చల్లని కబురు.. ఈ నెల 15 నుంచి వర్షాలు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై అనేక ప్రమాదాలు జరిగాయి. ముంబై - నాగ్‌పూర్ మధ్య ఉన్న ఈ రహదారి పొడవు 701 కిలోమీటర్లు. ఇది గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఇందులో 17 అండర్‌పాస్‌లు ఉన్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నాగ్‌పూర్, వార్ధా, అమరావతి, వాషిం, అహ్మద్‌నగర్, నాసిక్, బుల్దానా, ఔరంగాబాద్, జాల్నా, థానే అనే 10 జిల్లాల గుండా వెళుతుంది.

కర్ణాటకలో ప్రధాని టూర్: మాండ్యలో మోడీకి బ్రహ్మరథం

మహారాష్ట్రలోని లాతూర్‌లో ఇలాంటి ప్రమాదమే ఈ నెల 5వ తేదీన చోటు చేసుకుంది. ఓ మోటర్‌బైక్‌ను టెంపో ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ బైక్ పై ఆరుగురు వ్యక్తులు కూర్చొని రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు. ఈ బైక్ కలాంబ్ వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ఎదురుగా ఓ టెంప్ వేగంగా వస్తోంది. అయితే ఎదురుగా, రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ను టెంపో గమనించకపోవడంతో దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం విచారకరం. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే గేట్‌గావ్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాలను లాతూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ లో చేర్పించారు.