మతాంతర వివాహం చేసుకున్న 26 ఏళ్ల మహిళపై కాల్పులు..
Jaipur: జైపూర్లో మతాంతర వివాహం చేసుకున్న 26 ఏళ్ల మహిళపై కాల్పులు జరిపారు. అంజలి అనే మహిళ తన ద్విచక్ర వాహనాన్ని తను పనిచేసే దుకాణం బయట పార్కింగ్ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులకు పాల్పడ్డారు.
interfaith marriage: మతాంతర వివాహం చేసుకున్న ఒక మహిళపై ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అంజలి అనే మహిళ తన ద్విచక్ర వాహనాన్ని తను పనిచేసే దుకాణం బయట పార్కింగ్ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదుచేసుకున్నపోలీసులు విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. జైపూర్లో బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మతాంతర వివాహం చేసుకున్నందుకు 26 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అంజలి అనే మహిళ తన ద్విచక్ర వాహనాన్ని తను పనిచేసే దుకాణం బయట పార్కింగ్ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాల్పుల్లో అంజలి వెనుక భాగంలో బుల్లెట్ గాయమైంది. స్థానికులు ఆమెను కన్వతియా ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు శస్త్ర చికిత్స జరిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.
అంజలి వర్మ, ఆమె భర్త అబ్దుల్ లతీఫ్ ఒకరికొకరు కాలేజీ నుండి తెలుసు. వారు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే తమ మతాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని లతీఫ్ తన కుటుంబానికి చెప్పాడు, కానీ వారు అతనిని బెదిరించడం ప్రారంభించారు. పెళ్లికి అమ్మాయి కుటుంబీకులు అభ్యంతరం చెప్పలేదని సమాచారం. ఈ క్రమంలోనే జూలై 28, 2021న ఇద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత ఇరు వర్గాల వారు శాంతించారు. అయితే, ఇరు వర్గాల ఆగ్రహం చల్లారడంతో అంజలి స్థానిక దుకాణంలో అటెండర్గా చేరింది. గత డిసెంబర్లో అంజలి బావమరిది అజీజ్ అనే వ్యక్తి తమ మతాంతర వివాహం విషయం బెదిరింపులకు గురిచేశాడు.
లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది అతడిని అతని సోదరుడు కిడ్నాప్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, పరస్పర ఒప్పందంతో కేసును పరిష్కరించారు. తర్వాత, సోదరుడు మళ్లీ దంపతులను బెదిరించడం ప్రారంభించాడు. అజీజ్, అతని స్నేహితులు అతని భార్యపై దాడి వెనుక ఉండవచ్చునని లతీఫ్ చెప్పినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంజలి తల్లి నిర్మల్ దేవి మాట్లాడుతూ.. తన కుమార్తె అత్తమామలు దంపతులను బెదిరిస్తున్నారనీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు నిందితులు హెల్మెట్తో ముఖాలకు కప్పుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్లు కనిపించిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వందిత రాణా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. కాల్పుల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఏడాది క్రితమే కోర్టు వివాహం చేసుకున్నామని అంజలి భర్త అబ్దుల్ తెలిపారు. "నా కుటుంబం వ్యతిరేకించింది. మా అన్నయ్య అబ్దుల్ లతీఫ్, అతని సహచరుడు రియాజ్ ఖాన్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. దీనిపై సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాం. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫలితం లేకపోయింది. పోలీసులు వారిపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదు. పెళ్లయినప్పటి నుంచి అంజలికి హత్య భయం పట్టుకుందని అబ్దుల్ చెప్పాడు. ఇందుకోసం కోర్టులో కూడా భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు" చేశారు.