దారుణం... 90ఏళ్ల వృద్ధుడికి మత్తు ఇచ్చి.. ఫ్రిడ్జ్ లో కుక్కి..
ఇటీవల ఆ కుర్రాడిలో డబ్బుపై ఆశ పెరిగింది. అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే గత శనివారం సాయంత్రం ఇంట్లోకి వచ్చిన యువకుడు రోజూ మాదిరి టీ తీసుకొచ్చి వృద్ధ దంపతులకు ఇచ్చాడు. అయితే కిడ్నాప్కు పథకం పన్నిన యువకుడు ఆ టీలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు కోసం 90ఏళ్ల వృద్ధుడికి నరకం చూపించారు. మత్తు మందు ఇచ్చి వృద్ధుడిని బలవంతంగా ఫ్రిడ్జిలో కుక్కేశారు. అనంతరం కిడ్నాప్ డ్రామా నడిపించారు. కాగా... దుండగులు ఈ దారుణానికి పాల్పడటానికి ఆ వృద్ధుడు ఇంట్లో పనిచేసే కుర్రాడు సహాయం చేయడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన క్రిషన్ కోస్లా(90) రిటైర్డ్ ఉద్యోగి. తన భార్యతో కలిసి సౌత్ ఢిల్లీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా... ఒకరు విదేశాల్లో ఉంటున్నారు. మరొకరు బిజినెస్ చేసుకుంటున్నాడు. సరిగ్గా సంవత్సరం క్రితం వృద్ధ దంపతులకు తోడుగా ఉండేందుకు ఓ కుర్రాడిని నియమించారు. అప్పటి నుంచి వాళ్లని ఆ కుర్రాడు చూసుకుంటున్నాడు.
అయితే... ఇటీవల ఆ కుర్రాడిలో డబ్బుపై ఆశ పెరిగింది. అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే గత శనివారం సాయంత్రం ఇంట్లోకి వచ్చిన యువకుడు రోజూ మాదిరి టీ తీసుకొచ్చి వృద్ధ దంపతులకు ఇచ్చాడు. అయితే కిడ్నాప్కు పథకం పన్నిన యువకుడు ఆ టీలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. అనంతరం ఆ యువకుడు రాత్రీ ఎనిమిది గంటలకు మరో నలుగురు మిత్రులను ఇంటికి పిలిచాడు. ఐదుగురు కలిసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను, ఫ్రిజ్ను తీసుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న వాచ్మెన్ మాత్రం పాత సామాను అమ్మడానికి వెళ్తున్నరనుకోని చూసి చూడనట్లు వదిలేశాడు. అయితే వారు ఫ్రిజ్లో క్రిషన్ను కుక్కి కిడ్నాప్ చేశారన్న విషయాన్ని గమనించలేకపోయాడు.
మత్తమందుతో నిద్రలోకి జారుకున్న క్రిషన్ భార్య ఆదివారం ఉదయం మేలుకునే సరికి భర్తతో పాటు ఇంట్లో పని చేసే యువకుడు సైతం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దుండగులు కోస్లాను కిడ్నాప్ చేశారా ఇంకా ఏదైన చేశారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.