ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్: 8 మంది మావోల హతం
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు సుమారు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ పేరిట భారీ కూంబింగ్కు దిగారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు సుమారు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ పేరిట భారీ కూంబింగ్కు దిగారు.
ఈ క్రమంలో కసాల్పవాడ్ అటవీప్రాంతంలో మావోలు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమవ్వగా, భారీగా మందుగుండు సామాగ్రి లభ్యమైంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.