Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదం: కారులో మంటలు.. ఏడుగురు సజీవ దహనం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్‌.. కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. 

7 Killed In Car-Truck Collision In Gujarat ksp
Author
Gujarat, First Published Nov 21, 2020, 4:14 PM IST

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్‌.. కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios