ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లోంచి ఏకంగా 60 పాములను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఒకే ఇంట్లో ఇన్ని పాములు బయటపడడంతో స్థానికులు భయాందోళనల్లో పడ్డారు.  

ముజఫర్ నగర్ : ఓ ఇల్లు snakes గూడుగా మారిన ఘటన Uttarpradesh రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది. Muzaffarnagar లోని ఓ ఇంటినుంచి 60 పాములు, 75 గుడ్డు పెంకులను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముజఫర్ నగర్ ఇంట్లోని బాత్ రూంలో 60 పాములు, 75 గుడ్ల పెంకులు కనిపించాయి. ఇంట్లోనే పాముల సంచారం వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టే వారిని రంగంలోకి దించి గంటల తరబడి శ్రమించి పాములను పట్టుకుని అడవుల్లోకి వదిలారు. 

పాములున్న ఈ ఇల్లు ముజఫర్ నగర్ జిల్లాలోని ఖతౌలీ తహసీల్ లో ఉంది. ఈ ఇల్లు రంజిత్ సింగ్ కు చెందినది కానీ, చాలాకాలం క్రితం దీన్ని అద్దెకు ఇచ్చారని దర్యాప్తులో తేలింది. పాము గూడు ఉన్న ఇంట్లో దుమ్మూ ధూళీ ఉందని అక్కడి నివాసితులు తెలిపారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద సంఖ్యలో పాములు ఇంట్లోకి వచ్చాయని స్థానికులు చెప్పారు. ఇంట్లో 60 పాములున్న ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్ట్ లో భువనేశ్వర్ లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పాములు మనుషుల్ని కరవడం రొటీన్. కానీ మనుషులు పాముల్ని కరవడం వింత. ఇటీవలి కాలంలో ఇలాంటి వింత సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. తనను కరిచిందన్న కోపమో, దారికి అడ్డు వచ్చిందనో.. కారణమేదైనా కానీయండి మనుషులు పాముల్ని కరవడం, కొరికి చంపడం కామన్ అయిపోతోంది. 

అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఓ వ్యక్తిని పాము కాటేసింది. వెంటనే ఆ వ్యక్తి భయపడలేదు. బెదిరిపోలేదు. వణికిపోలేదు. పాము మీద కోపానికి వచ్చాడు. నన్నే కరుస్తావా అంటూ ఆగ్రహంతో ఆ పామును పట్టుకుని గట్టిగా కరిచేశాడు. దీంతో పాపం ఆ పాము చచ్చి ఊరుకుంది. వివరాల్లోకి వెడితే.. జాజ్ పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45) గిరిజన రైతు. బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని.. పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇంతలో కొద్ది దూరం వచ్చేసరికి అతని కాలికి ఏదో గుచ్చుకున్నట్టు అయ్యింది. చూస్తే ఏదో కరిచినట్టు ఉంది. 

దీంతో చేతిలోని టార్చ్ లైట్ వేసి చుట్టు పక్కల చూశాడు. తనను కరిచింది పాము అని అర్థమ్యింది. అది కూడా విషపూరితమైన సర్పం అని గుర్తించాడు. అంతే కోపంతో ఊగిపోయాడు. ప్రతీకారంతో చెలరేగిపోయాడు. పామును పట్టుకుని కొరకడం మొదలు పెట్టాడు. కోపం తీరేదాకా దాన్ని కొరికి, కొరికి వదిలిపెట్టాడు. ఈ చర్యకు పాపం పాపం బిత్తరపోయి ఉండొచ్చు. కానీ దానికంతగా తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండానే దాన్ని కొరికేశాడు. దాంతో అది దెబ్బకు చచ్చి ఊరుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పామును కరిచిన కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

దీంతో కిశోర్ బద్ర ఊరుకోలేదు. చచ్చిన సారీ.. సారీ.. చంపిన పామును తీసుకుని ఊర్లోకి వచ్చాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆమె షాక్ తో ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా ఊరంతా తెలిసిపోయింది. దీంతో గ్రామంలో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.