బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 6 గురు మృతి
బీహార్ లోని ఓ నూడూల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 గురు అక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Muzaffapur boiler blast : బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను జిల్లా ఎస్పీ నిర్ధారించారు. ముజఫర్పూర్ దగ్గర్ల లో ఓ నూడుల్స్ ఫ్యాక్టరీ ఉంది. ఆదివారం ఉదయం యాథావిధిగా ఫ్యాక్టరీలో పనులు జరుగుతుండగా ఒక్క సారిగా బాయిలర్ పేలిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భారీ పేలుడు కావడంతో శబ్ధం 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న సమీప గ్రామాలకు వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆయా సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది పరిగెత్తుకుంటూ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఇప్పటికీ పేలిన ఆ బాయిలర్ నుంచి పొగలు వస్తున్నాయి.
ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పని చేస్తున్నారో ఇంకా తెలియరాలేదు. మంటలను ఆర్పేందుకు 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఈ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న సంస్థలు కూడా దెబ్బతిన్నాయని వారు తెలిపారు.