తెగిన తివారీ ఆనకట్ట: ఆరుగురి మృతి, 24 మంది ఆచూకీ గల్లంతు (వీడియో)
మహారాష్ట్రలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరిలోని తివారీ డ్యామ్ తెగిపోవడంతో లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సుమారు 7 గ్రామాలన్నీ జలమయ్యాయి.
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరిలోని తివారీ డ్యామ్ తెగిపోవడంతో లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సుమారు 7 గ్రామాలన్నీ జలమయ్యాయి.
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 నుండి 24 మంది ఆచూకీ లేకుండాపోయింది. ఈ డ్యామ్కు సమీపంలోని 12 ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
ఈ ఘటనతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్రలో భారీగా వర్షాల కురుస్తుండడంతో విమానాలు, రైళ్లు కూడ రద్దయ్యాయి.
#WATCH: Tiware dam in Ratnagiri was breached earlier today. 6 bodies have been recovered till now. Rescue operations continue. 12 houses near the dam also washed away. #Maharashtra pic.twitter.com/mkgLaruaau
— ANI (@ANI) July 3, 2019