అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ లో శనివారం భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు భారత జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
కాగా... మావోయిస్టులను ఎదుర్కొందుకు మరింత మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అవసరం కాగా... ఘటనాస్థలికి వారు చేరుకోలేకపోతున్నట్లు సమాచారం. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
మావోయిస్టులు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స నిమిత్తం తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 24, 2019, 11:34 AM IST