5 కత్తులతో శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు..
శ్రద్ధ హత్య కేసు: శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు అత్యంత పదునైన ఐదు కత్తులను ఉపయోగించినట్లు నిందితుడు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. గత కొద్ది రోజులుగా నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. అతని అద్దె ఇంటి నుండి పోలీసులు 5 పెద్ద కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ కోసం ఫోరెన్సిక్ బృందానికి పంపారు.
శ్రద్ధ హత్య కేసు: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. శ్రద్ధాను హత్య చేసి.. 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్ అమీన్ను పోలీసులు గత కొన్ని రోజులుగా విచారిస్తున్నారు. నేడు అతనికి పాలీగ్రాఫ్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో ఒళ్లు గగుర్పాటు గురి చేసే.. విషయాలను వెల్లడించారు.
శ్రద్ధాను మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు అతను అయిదు కత్తులు వాడినట్లు ఆ టెస్ట్లో తెలిపాడు. ఆ కత్తులను కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా కూల్గా, నార్మల్గా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లాట్ నుంచి పలు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ కత్తులు చాలా పదునైనవి, దాదాపు 5-6 అంగుళాల పొడవు, పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం. అఫ్తాబ్ ఈ కత్తులను శ్రద్ధా శరీరాన్ని కోసేందుకు ఉపయోగించాడా అనేది ఫోరెన్సిక్ బృందం చెప్పగలదని అధికారులు తెలిపారు.
నవంబర్ 12న దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని తన అద్దె ఫ్లాట్లో శ్రద్ధను హత్యకు గురైంది. ఈ కేసులో ఆఫ్తాబ్ పూనావల్లా (28)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అఫ్తాబ్ శ్రద్ధను గొంతు నులిమి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సుమారు 35 ముక్కలుగా నరికాడు. దాదాపు మూడు వారాల పాటు ఇంట్లో రిఫ్రిజిరేటర్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత చాలా రోజుల పాటు వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో విసిరి వేశాడు.
రెండేండ్ల క్రితమే ఫిర్యాదు
శ్రద్ధా హత్య కేసు బుధవారం మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది.నవంబర్ 2020లో మహారాష్ట్రలోని తులింజ్ పోలీస్ స్టేషన్లో అఫ్తాబ్ పూనావాలా తనను కొట్టి దుర్భాషలాడేవాడని శ్రద్ధా ఫిర్యాదులో పేర్కొంది. అఫ్తాబ్ నన్ను గొంతుకోసి చంపడానికి ప్రయత్నించాడని శ్రద్ధా చెప్పింది. నన్ను చంపేస్తానని, ముక్కలు ముక్కలుగా నరికి ఎక్కడికో పడేస్తానని బెదిరించాడు. గత ఆరు నెలలుగా నన్ను కొడుతున్నాడని, చంపేస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించే ధైర్యం నాకు లేదని తన ఫిర్యాదులో పేర్కొంది.