వినాయకచవితి రోజున ముగ్గురు  హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 


కోయంబత్తూరు: వినాయకచవితి రోజున ముగ్గురు హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

కోయంబత్తూరులోని ఓ పెళ్లికి హజరైన ఐదుగురిని ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ మక్కల్ మచ్చి వ్యవస్థాపకుడు అర్జున్ సంప‌త్ తో పాటు మరో ఇద్దరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే సమాచారంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఐదుగురికి ఐసీస్‌తో కూడ సంబంధాలు ఉన్నాయని సమాచారం. వినాయకచవితిని పురస్కరించుకొని మత ఘర్షణలు జరిగేలా ప్లాన్ చేసేందుకుగాను కూడ ఈ ఐదుగురు కుట్రలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

ఈ ఐదుగురిని శనివారం నాడే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే రెండు రోజుల పాటు విచారించిన తర్వాత వీరి ప్లాన్ తేటతెల్లమైంది. సోమవారం నాడు నిందితులను కోయంబత్తూరు కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.