Asianet News TeluguAsianet News Telugu

కోయంబత్తూరులో మత ఘర్షణలకు ప్లాన్: ఐదుగురి అరెస్ట్

వినాయకచవితి రోజున ముగ్గురు  హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

5 Arrested For Conspiracy To Kill Two Hindu Leaders In Tamil Nadu
Author
Coimbatore, First Published Sep 3, 2018, 12:45 PM IST


కోయంబత్తూరు: వినాయకచవితి రోజున ముగ్గురు  హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

కోయంబత్తూరులోని ఓ పెళ్లికి హజరైన ఐదుగురిని ఇంటలిజెన్స్  నివేదిక ఆధారంగా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ మక్కల్ మచ్చి వ్యవస్థాపకుడు అర్జున్ సంప‌త్ తో పాటు మరో ఇద్దరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే సమాచారంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఐదుగురికి ఐసీస్‌తో కూడ సంబంధాలు ఉన్నాయని సమాచారం. వినాయకచవితిని పురస్కరించుకొని  మత ఘర్షణలు జరిగేలా ప్లాన్ చేసేందుకుగాను  కూడ ఈ ఐదుగురు కుట్రలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

ఈ ఐదుగురిని శనివారం నాడే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే  రెండు రోజుల పాటు విచారించిన తర్వాత వీరి ప్లాన్  తేటతెల్లమైంది. సోమవారం నాడు నిందితులను  కోయంబత్తూరు కోర్టులో  హాజరుపర్చారు. నిందితులకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios