Asianet News TeluguAsianet News Telugu

రామేశ్వరం తీరప్రాంతంలో భారీగా బైటపడ్డ ఏకే47 తుపాకులు, పేలుడు పదార్థాలు

ఎల్టీటీఈ కి సంబంధించినవిగా అనుమానం....

5,000 bullets and explosives unearthed in Rameswaram

తమిళనాడు లో రామేశ్వరంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పధార్థాలు లభించాయి. ఓ వ్యక్తి తన సొంత స్థలంలో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు జరపగా ఈ పేలుడు పదార్థాలు బైటపడ్డాయి. దీంతో కంగారుపడిపోయిన అతడు పోలీసులకు సమాచారం అందించాడు. 

తమిళనాడు రామంతాపురం జిల్లా కు రామేశ్వరం కు చెందిన ఓ మత్స్యకారుడు తన ఇంటి వద్ద ఓ నిర్మాణం చేపట్టేందుకు తవ్వకాలు జరిపాడు. సముద్ర తీరంలోని కొబ్బరి తోటలో ఓ ఐదడుగుల లోతు తవ్వేవరకు భారీగా పెట్టెలు బైటపడ్డాయి. దీంతో అతడు ఎంతో ఆసక్తిగా ఆ పెట్టెను తెరిచిచూడగా అందులో భారీ సంఖ్యలో ఎకె47 తుపాకీలు, అందులో వాడే బుల్లెట్లు, బాంబులు, మరి కొంత మందుగుండు సామాగ్రి లభించింది. కంగారుపడిపోయిన అతడు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని ఎంతో శ్రమించి జాగ్రత్తగా బైటికి తీశారు. ఆ పెట్టెలను తెరిచి చూడగా భారీ ఎత్తున ఆయధాలు కనిపించాయి. దాదాపు 5వేల బుల్లెట్లతో పాటు, వందల కేజీల మందుగుండు సామగ్రి బయటపడటంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఓంప్రకాశ్ మీనా మాట్లాడుతూ...బైటపడ్డ పేలుడు పధార్థాలు శ్రీలంక కు చెందిన ఎల్టీటీఈ కి సంబంధించినవిగా బావిస్తున్నట్లు తెలిపారు. 1983-90ల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని  ఎల్టీటీఈ శిక్షణా కేంద్రంగా వాడుకుని ఉండవచ్చని, అప్పుడే ఇవి ఇక్కడ డంప్ చేసి ఉంటారని వివరించారు. ప్రస్తుతం ఇవి తుప్పుపట్టిపోయి ఉన్నాయని ఎస్పీ  తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios