సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 48.20 కిలోల బంగారు పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాని ఖరీదు దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ముగ్గురు ప్రయాణికులు, ఒక అధికారిని అరెస్టు చేశారు
సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 48.20 కిలోల బంగారు పేస్ట్ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. షార్జా నుండి సూరత్ కు వస్తున్న ప్రయాణీకులను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 48.20 కిలోల బంగారు పేస్ట్ను స్వాధీనం చేసుకుంది. దాని ఖరీదు దాదాపు రూ.25 కోట్లు. ఈ కేసులో ముగ్గురు ప్రయాణికులు, ఒక అధికారిని అరెస్టు చేశారు.
నిఘా సమాచారం ఆధారంగా.. డిపార్ట్మెంట్ అధికారులు జూలై 7న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX 172లో షార్జా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను విమానాశ్రయంలో అడ్డుకున్నారని DRI ఒక ప్రకటనలో తెలిపింది. వీరు బంగారాన్ని పేస్టుగా మర్చి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించారు. వారి బ్యాగేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 20 తెలుపు రంగు ప్యాకెట్లలో 43.5 కిలోల బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంలో ఎయిర్పోర్టులోని అధికారులు కూడా సహకరించారని చెబుతున్నారు. స్క్రీనింగ్ , తనిఖీలను నివారించడానికి ఇమ్మిగ్రేషన్కు ముందు ఉన్న టాయిలెట్కు బదిలీ చేయాలని యోచిస్తున్నట్లు DRI తెలిపింది. నిందితులందరి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది. డీఆర్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యవస్థీకృత స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారణ ఇంకా కొనసాగుతోంది.
