కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.