గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: కారుపై పడిన ట్రక్కు, నలుగురు మృతి
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు మరో రోడ్డులో ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
న్యూఢిల్లీ: ఢీల్లీ-జైపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గురుగ్రామ్ శివారులో మంగళవారం నాడు తెల్లవారుజామున .ఈ ఘటన చోటు చేసుకొంది. డివైడర్ ను దాటుకొని మరో రోడ్డులో ప్రయాణీస్తున్న కారుపై పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కారులో ఇద్దరు మహిళలు, డ్రైవర్ సహా కారులో ఆరుగురున్నారు. ఉదయ్ పూర్ నుండి వీరంతా నోయిడాకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మృుతుల్లో ఓ మహిళ, ఇద్దరు పురుషులు, డ్రైవరున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు.
ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్టుగా బిలాస్ పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ మాలిక్ చెప్పారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్టుగా ఆయన చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. . కారులో ప్రయాణీస్తున్న వారంతా నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.