Asianet News TeluguAsianet News Telugu

గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: కారుపై పడిన ట్రక్కు, నలుగురు మృతి

ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు మరో రోడ్డులో ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

4 Executives Die After Truck Falls On Their Car  In Gurugram
Author
New Delhi, First Published Aug 17, 2022, 6:15 PM IST

న్యూఢిల్లీ: ఢీల్లీ-జైపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గురుగ్రామ్ శివారులో మంగళవారం నాడు తెల్లవారుజామున .ఈ ఘటన చోటు చేసుకొంది.  డివైడర్ ను దాటుకొని మరో రోడ్డులో ప్రయాణీస్తున్న కారుపై పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  కారులో ఇద్దరు మహిళలు, డ్రైవర్ సహా కారులో ఆరుగురున్నారు. ఉదయ్ పూర్ నుండి వీరంతా నోయిడాకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  మృుతుల్లో ఓ మహిళ, ఇద్దరు పురుషులు, డ్రైవరున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు.

ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్టుగా  బిలాస్ పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ మాలిక్ చెప్పారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్టుగా ఆయన చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. . కారులో ప్రయాణీస్తున్న వారంతా నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios