కాంచీపురంలో తొక్కిసలాట: గుంటూరు మహిళ సహా నలుగురు మృతి
కాంచీపురం అత్తి వరద రాజస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు ఏపీ రాష్ట్రానికిచెందిన మహిళ కూడ ఉన్నారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో గురువారం నాడు అపశృతి చోటు చేసుకొంది. ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి
అత్తి వరద రాజస్వామి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఒకరు ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.