కాంచీపురం అత్తి వరద రాజస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు ఏపీ రాష్ట్రానికిచెందిన మహిళ కూడ ఉన్నారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో గురువారం నాడు అపశృతి చోటు చేసుకొంది. ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అత్తి వరద రాజస్వామి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఒకరు ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.