మందుపాతర పేల్చిస మావోలు: నలుగురు సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్) చెందిన సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
రాయపూర్: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్) చెందిన సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వివరాలు తెలియాల్సి ఉంది. నక్సలైట్లు మైన్ ప్రొటెక్టెడ్ వెహికిల్ (ఎంపివి)ని పేల్చి వేశారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం 4 గంటలకు అవపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ముర్దండ సిఆర్పీఎఫ్ శిబిరం వద్ద చోటు చేసుకుంది.
వాహనంలో ఆరుగురు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టులు శక్తివంతమమైన మందుపాతర పేల్చారు. దీంతో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు.
మరణించినవారిలో ఓ ఎఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నవంబర్ 12వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Four Central Reserve Police Force (CRPF) jawans have lost their lives in an encounter with Naxals in Bijapur. Two jawans are injured. More details awaited. #Chhattisgarh pic.twitter.com/Mrb7IobEFJ
— ANI (@ANI) October 27, 2018