కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడి పాకిస్తాన్ రేంజర్స్ జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లా చాంబ్లియాల్ సెక్టార్ లో కాల్పులు జరిపారు. 

శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడి పాకిస్తాన్ రేంజర్స్ జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లా చాంబ్లియాల్ సెక్టార్ లో కాల్పులు జరిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దులో వారు ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.

2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని గత నెలలోనే పాకిస్తాన్, భారత్ పరస్పరం ఓ అంగీకారానికి వచ్చాయి. శాంతి స్థాపనకు ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచాలని, సరిహద్దు వెంబడి పౌరులకు ఇబ్బందులు కలిగించవద్దని కూడా అనుకున్నాయి. 

కానీ ఇంతలోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.