ఇంత ఘోరమా.. మూడేండ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు నిందితుల అరెస్టు
ఢిల్లీలో మూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలిక ఉదయం తన ఇంటి దగ్గర ఆడుకుంటోంది. అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. స్థానిక సమీపంలోని అడవిలో బాలిక రక్తంతో తడిసి ఏడుస్తూ కనిపించింది.
మూడేండ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు: దేశ రాజధాని ఢిల్లీ సమాజం సిగ్గుతో తలదించుకోవల్సిన ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని మూడేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమాయకురాలిపై ఇంత క్రూరంగా ప్రవర్తించిన ఘటన శుక్రవారం (ఫిబ్రవరి 3) ఉదయం జరిగింది. నివేదికల ప్రకారం.. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బెరీ ప్రాంతానికి చోటు చేసుకుంది.
తెల్లవారుజామున ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో బాలిక కోసం వెతకడం ప్రారంభించామని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. చుట్టుపక్కల నివసించే ఒక మహిళ, తాను ఆ ప్రాంతానికి సమీపంలోని అడవిలో బాలికను చూశానని చెప్పింది. ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను అడవి వైపు వెళ్లడం కూడా తాను చూశానని ఆ మహిళ చెప్పింది. మహిళ నుంచి సమాచారం అందుకున్న వెంటనే అడవిలో వెతకగా బాలిక ఏడుస్తూ కనిపించింది. వెంటనే బాలికను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో కేసు దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక రక్తపు మడుగులో ఉందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలికను ఎయిమ్స్లో చేర్చగా, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడి గురించి పోలీసులు ఈ మేరకు సమాచారం అందించారు.నిందితులను 27 ఏళ్ల రామ్నివాస్ పనికా, 22 ఏళ్ల శక్తిమాన్ సింగ్గా గుర్తించారు.
నిందితులిద్దరూ రీసైక్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక పరిస్థితి చూసి ఆమె తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.