ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టుపై నుంచి పడిపోయిన బస్సు.. 25 మందికి..
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లాలో గుజరాత్కు వెళుతున్న బస్సు కల్వర్టుపై కింద నుండి పడిపోవడంతో కనీసం 25 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఉజ్జయినిలో బస్సు బోల్తా పడడంతో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భుఖిమాత-ముల్లాపుర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లాలో గుజరాత్కు వెళుతున్న కల్వర్టుపై నుంచి కిందపడి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. వారిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కలెక్టర్ కుమార్ పురుషోత్తం స్పందించారు. బస్సు ఇండోర్ నుండి రాజ్కోట్కు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. కల్వర్టుపై చీకటిగా ఉండడంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ప్రమాద వార్త తెలియగానే కలెక్టర్, ఏఎస్పీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రోడ్డుపై చీకటిగా ఉందని, అతివేగం వల్ల ప్రమాదం జరిగిందని ఉందన్నారు.
మహాకాల్ ఏరియా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిఎస్పి) ఓంప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో దాదాపు 35 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు అతివేగంతో నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. బస్సు బోల్తా పడిన తర్వాత వాహనం నుంచి ముందు చక్రాలు, ఇంజన్ విడిపోయాయని తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి స్కిడ్ అయి 8 అడుగుల కిందకు పడిపోయిందని ఆయన చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్పై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశామని మిశ్రా తెలిపారు.
పుల్వామా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ క్రమంలో 28 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్సూ ప్రాంతంలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులంతా బీహార్ వాసులేనని తెలిపారు. కాగా, గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.