Andaman Nicobar: భార‌త స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీరచక్ర పురస్కారాల గ్ర‌హీత‌ల పేర్ల‌ను పెట్టారు. 

Parakram Diwas 2023: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకుని, పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని న‌రేంద్ర మోడీ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. భార‌త స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీఆవిష్కరించారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీరచక్ర పురస్కారాల గ్ర‌హీత‌ల పేర్ల‌ను పెట్టారు. మరిచిపోయిన నేతాజీని ఈ రోజు ప్రతి క్షణం ఎలా స్మరించుకుంటున్నారో మార్పుకు 21వ శతాబ్దం సాక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. సుభాష్ చంద్రకు సంబంధించిన పనులు గత 8-9 సంవత్సరాలుగా జరిగాయని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంవత్సరాల్లో చేసి ఉండాల్సిందని ఆయన అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

అండమాన్ నికోబార్ దీవుల పేర్లు పెట్టడంపై ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ, "21 మంది పరమవీర్ చక్ర పుర‌ష్కారాలు అందుకున్న వారి పేర్లు పెట్టాం.. ఇప్పుడు అండమాన్-నికోబార్ లోని ఈ ద్వీపాలను వారి పేర్ల‌తో పిలుస్తారు, మాతృభూమిలోని ప్రతి భాగాన్ని తమ సర్వస్వంగా భావిస్తారు" అని అన్నారు.

Scroll to load tweet…

21 పరమవీర్లకు 'ఇండియా ఫస్ట్' అనే ఒకే ఒక్క తీర్మానం ఉందని ఆయన చెప్పారు. "ఈ రోజు ఈ ద్వీపాలకు నామకరణం చేయడంలో, వారి సంకల్పం ఎప్పటికీ చిరస్మరణీయంగా మారింది. అండమాన్ సామర్థ్యం చాలా పెద్దది. గత ఎనిమిదేళ్లుగా దేశం ఈ దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశం కోసం పోరాడిన వీర్ సావర్కర్ తో పాటు అనేక మంది వీరులను అండమాన్ గడ్డపై నిర్బంధించారు. 4-5 సంవత్సరాల క్రితం నేను పోర్ట్ బ్లెయిర్ ను సందర్శించినప్పుడు, అక్కడి 3 ప్రధాన ద్వీపాలకు భారతీయ పేర్లను అంకితం చేశాను" అని ప్రధాన మంత్రి అన్నారు. 21 ద్వీపాలకు ఈ రోజు కొత్త పేర్లు పెట్టడంలో అనేక సందేశాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ సందేశం ఉంద‌ని అన్నారు. ఈ సందేశం మన సాయుధ దళాల ధైర్యసాహసాల గురించి వివ‌రిస్తుంద‌ని తెలిపారు. 

Scroll to load tweet…

పేరులేని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత, మేజర్ సోమనాథ్ శర్మ పేరు పెట్టారు, ఆయ‌న నవంబర్ 3, 1947న శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పాకిస్తానీ చొరబాటుదారులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను కోల్పోయారు.