అయోధ్యలో ఉగ్రదాడి: నలుగురికి జీవిత ఖైదు, మరోకరి విముక్తి
2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది.
న్యూఢిల్లీ : 2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది.
2005 జూలై 5వ తేదీన అయోధ్యలోని జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు తీర్పును వెలువరించింది.
నేపాల్ బోర్డర్ నుండి తీవ్రవాదులు ఈ ప్రాంతానికి చేరుకొన్నారు. యాత్రికుల మాదిరిగా అయోధ్యకు చేరుకొని దాడికి దిగారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురి తీవ్రవాదులకు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో మరోకరికి సంబంధం లేదని భావించిన కోర్టు ఆయనకు విముక్తిని ప్రసాదించింది.