బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది.
బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. పోరూర్లోని ఓ పార్కింగ్ ప్రదేశంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 200 కార్లు కాలి బూడిదయ్యాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 5 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అగ్నికీలల్లో కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.
