స్మృతీ ఇరానీ తెర మీద కనిపించి 20ఏళ్లు..
సీరియల్ మొదలుపెట్టిన ఇటీవల 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్మృతీ ఇరానీ ఆనాటి విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సీరియల్ తొలి రోజు తాను ఎలా ఫీలయ్యిందో.. ఆమె వివరించారు.
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. ఒకప్పుడు టీవీ సీరియల్స్ లో నటించారన్న విషయం తెలిసిందే. ఆమె టెలివిజన్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యో కి సాస్ బీ కభీ బహు తీ’ వంటి టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన స్మృతి ఇరానీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
అయితే... ఆ సీరియల్ మొదలుపెట్టిన ఇటీవల 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్మృతీ ఇరానీ ఆనాటి విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సీరియల్ తొలి రోజు తాను ఎలా ఫీలయ్యిందో.. ఆమె వివరించారు.
20 సంవత్సరాల క్రితం సుధా ఆంటీతో నేను తొలి సీన్ లో నటించానని ఆమె చెప్పారు. ఆ సీరియల్ లో తన పాత్ర పేరు తులసి అని చెప్పారు. అయితే.. తన తొలి షాట్ చూసి తనకు నటించడం రాదని.. షో ప్లాప్ అవుతుందని డైరెక్టర్ అన్నారని ఈ సందర్భంగా స్మృతీ గుర్తు చేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సీరియల్ తో స్మృతీకి అభిమానులకు విపరీతంగా పెరిగిపోయారు. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు.
అంతేకాకుండా.. ఆ రోజు తాను ఏక్తాకపూర్ తో చేసిన సంభాషణను కూడా స్మృతీ పంచుకున్నారు. కాగా.. ఇటీవల ఏక్తాకపూర్ కూడా స్మృతీకి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేశారు. టీవీ సీరియల్స్లో అడుగుపెట్టే ముందు ఆమె 1998లో ఆమె మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఏక్తా కపూర్ పోస్ట్ చేసింది. అందులో స్మృతి మాట్లాడుతూ.. తనకు రాజకీయాలంటే ఇష్టమని చెప్పారు. వినయం, విధేయత, మాట నిలబెట్టుకునే తత్త్వమే ఆమెను రాజకీయాల్లో రాణించేలా చేసిందని ఏక్తా కపూర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నా స్నేహితురాలిని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటూ ట్వీట్ చేసింది.
స్మృతి ఇరానీ విషయానికొస్తే.. ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యో కి సాస్ బీ కభీ బహు తీ’ సీరియల్తో పాపులర్ అయిన స్మృతి.. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో ఎన్.శంకర్ డైరెక్ట్ చేసిన జై బోలో తెలంగాణ సినిమాలో కూడా స్మృతి నటించింది. టీవీ, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత స్మృతి ఇరానీ.. రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు.