Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట: ఇద్దరు జైషే ముష్కరుల హతం

షోపియాన్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం ఉండటంతో బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు ఓ ఉగ్రవాదులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టారు. 

2 Jaish e mohammad terrorist killed by indian army in jammau and kashmir
Author
Jammu and Kashmir, First Published Feb 27, 2019, 11:17 AM IST

పుల్వామా ఘటన తర్వాత ఉగ్రవాదంపై భారత్ పోరును ముమ్మరం చేసింది. దాడి జరిగిన 48 గంటల్లోనే ఉగ్రదాడికి సూత్రధారిగా వ్యవహరించిన అబ్దుల్ రషీద్ ఘాజీ, కమ్రాన్‌లు హతమార్చిన భారత సైన్యం... దక్షిణ కశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.

ఈ క్రమంలో షోపియాన్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం ఉండటంతో బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు ఓ ఉగ్రవాదులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టారు.

ముష్కరులు కాల్పులు జరపడంతో... భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, వారిని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా సైన్యం తెలిపింది.     

Follow Us:
Download App:
  • android
  • ios