మహారాష్ట్రలో  వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఒకవైపు వర్షం, మరో వైపు భూకంపాల కారణంగా ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. బుధవారం నాడు అర్ధరాత్రి నాలుగు సార్లు భూకంపం సంభవించింది. భూకంపాల కారణంగా గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 12 నిమిషాల వ్యవధిలో నాలుగు దఫాలు భూకంపాలు సంభవించాయి. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. పాల్ఘర్ జిల్లాలోని దహను కేంద్రంగా భూకంపాలు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూకంప తీవ్రతకు దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భూకంపాలకు తోడుగా భారీ వర్షం కారణంగా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి.

2018 నవంబర్ మాసం నుండి ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు చోటు చేసుకొంటున్నాయి. దీంతో భూకంపాలు సంబంవించిన సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.