Asianet News TeluguAsianet News Telugu

దేశంలో కరోనా కేసులు : 20.61లక్షల పరీక్షలు.. 2.59 లక్షల పాజిటివ్ కేసులు...

ఢిల్లీ : దేశంలో కొత్తగా 2.59 లక్షల కోవిడ్ కేసులను నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 2.6 కోట్లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 4,209 మంది కరోనా రోగులు మరణించారు.

2.59 Lakh Fresh Covid Cases, India's Highest Daily Testing (20.61 Lakh) - bsb
Author
hyderabad, First Published May 21, 2021, 10:51 AM IST

ఢిల్లీ : దేశంలో కొత్తగా 2.59 లక్షల కోవిడ్ కేసులను నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 2.6 కోట్లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 4,209 మంది కరోనా రోగులు మరణించారు.

దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 2,91,331 కు పెరిగింది. రాబోయే 6-8 నెలల్లో థార్డ్ వేవ్ భయం నెలకొంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ కూడా అంత చురుకుగా ముందుకు సాగడం లేదు. 

దేశంలో ఇప్పటివరకు కరోనావైరస్ పై వచ్చిన పది అంశాలు ఇవి... 

గత నాలుగు రోజులుగా.. దేశంలో రోజుకు మూడు లక్షల లోపు కరోనా కేసులు నమోదువుతున్నాయి. దీంతో భారత్, అమెరికా తరువాత రెండవ స్థానంలో ఉంది. పాజిటివిటీ రేటు 12.58 శాతానికి పడిపోయింది.

గడిచిన 24 గంటల్లో 20.61 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు ఒక్కరోజులు చేసిన పరీక్షల్లో ఇవ్వే అత్యధికం. 

ఒక్కరోజులో అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తరువాత, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లు ఉన్నాయి.

మహారాష్ట్రలో గురువారం కొత్తగా 29,911 కరోనావైరస్ పాజిటివ్ కేసులు, 984మరణాలు నమోదయ్యాయి, దీంతో కేస్ లోడ్ సంఖ్య 54,97,448 కు, మరణాల సంఖ్య 85,355 కు చేరుకుంది. రాజధాని ముంబై లో పాజిటివిటీ రేటు 4.84 శాతానికి పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్టానికి 1,425 కొత్త కేసులను నమోదు చేసింది.

కర్ణాటకలో గురువారం కొత్తగా 28,869 కరోనావైరస్ కేసులు, 548 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో రోజువారీ కేసుల సంఖ్య 9,409 కి పడిపోయాయి.

పొరుగున ఉన్న తమిళనాడులో గత 24 గంటల్లో 35,579 మంది వైరస్ బారిన పడ్డారు, అంతకుముందు రోజు డేటా కంటే ఇది 2 శాతం ఎక్కువ. 6,073 కొత్త కేసులతో చెన్నై రోజువారీ ఇన్ఫెక్షన్ల సంఖ్యలో స్పల్ప తేడా ఉంది. 

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3,231 కరోనావైరస్ కేసులు, 233 మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధానిలో 4,000 కంటే తక్కువ కేసులు నమోదైన రెండో రోజుగా ఇది రికార్డ్. ఇక పాజిటివిటీ రేటు 5.5 శాతానికి పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో చర్చించిన తరువాత వారాంతంలో లాక్డౌన్ ఎత్తివేసే విషయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు.

కరోనా నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు అత్యవసర చర్యలను ఆదేశించాయి. ఒడిశా, గుజరాత్ బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించాయి. ఢిల్లీ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాలను మూడు ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

గడిచిన ఏడు రోజులుగా దేశంలో టీకా వేసే సగటు సంఖ్య తగ్గుతూ వస్తోంది. గురువారం ఈ సంఖ్యతో భయంకరమైన క్షీణతను కనిపించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గడిచిన రోజు కేవలం 11.66 లక్షల మంది మాత్రమే టీకాలు తీసుకున్నారని తెలిపింది. తమ జబ్లను పొందారని, తదుపరి తరంగాల అంటువ్యాధుల గురించి ఆందోళన చెందుతోంది.

భారత్ బయోటెక్ 200 మిలియన్ (20 కోట్ల) మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్ 'కోవాక్సిన్' ను ఉత్పత్తి చేయాలని గురువారం నిశ్చయించినట్టు ప్రకటించింది. గుజరాత్ లోని తమ అనుబంధ సంస్థలో ఇది చేస్తామని తెలిపింది. ఇక్కడ మొత్తం సుమారు 1 బిలియన్ (100 కోట్ల) వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios