అమానుషం.. రెండువేల కోసం మైనర్ తో బూట్లు నాకించారు..
మధ్యప్రదేశ్లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ మైనర్ తో అమానుషంగా ప్రవర్తించారు. రెండు వేల రూపాయల విషయంలో జరిగిన గొడవలో మైనర్ ను విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ తాగించారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ మైనర్ తో అమానుషంగా ప్రవర్తించారు. రెండు వేల రూపాయల విషయంలో జరిగిన గొడవలో మైనర్ ను విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ తాగించారు.
మధ్యప్రదేశ్లోని జబల్ పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత బుధవారం జబల్ పూర్ జిల్లాకు చెందిన 17యేళ్ల మైనర్ కు అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో రెండువేల రూపాయల విషయంలో గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో ఆ నలుగురు మైనర్ ను నయాగావ్ ఏరియాలోని పొలంలోకి తీసుకెళ్లారు. ఆ తరువాత విచక్షణా రహితంగా కొట్టి, బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ కూడా తాగించారు.
కొడుకు ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆ మైనర్ తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన తరువాత గురువారం రోజు మైనర్ ఇంటికి వెళ్లాడు. కానీ తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. ఆ సంఘటన తరువాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.