Asianet News TeluguAsianet News Telugu

ఘోర రైలు ప్రమాదం: 15 మంది వలస కూలీలు మృతి, చెల్లాచెదురుగా శవాలు

మహారాష్ట్రలోని ఔరంగబాదులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. దీంతో 15 మంది వలస కూలీలు మరణించారు.

15 migrant workers sleeping on railway track in Aurangabad dead in train accident
Author
Aurangabad, First Published May 8, 2020, 8:05 AM IST

ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది వలస కూలీల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జల్నా, ఔరంగాబాద్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు రైలు పట్టాలపై రాత్రి నిద్రించారు. వారిలో పిల్లలు కూడా  ఉన్నారు. వారిపై నుంచి రైలు వెళ్లింది. వారిపై గూడ్స్ రైలు వెళ్లింది. దాంతో ఆ ప్రమాదం జరిగింది. శవాలు సంఘటనా చెల్లాచెదురుగా పడిపోయాయి.

కర్మాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వై పోలీసు బలగాలు, పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. రైళ్లు రావడం లేదనే ఉద్దేశంంతో వలస కూలీలు రైల్వే ట్రాక్ మీద నిద్రించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios