Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. 

13 killed in run over by truck on Pratapgarh-Jaipur Highway rajasthan
Author
Pratapgarh, First Published Feb 19, 2019, 7:27 AM IST

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రతాప్‌గఢ్-జైపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలిలోనే తొమ్మిది మంది మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మరో 15 మందిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios