రాజస్థాన్లో ఘోర ప్రమాదం: బస్సు, ట్యాంకర్ ఢీ 12 మంది సజీవ దహనం
రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో మంటలు చెలరేగి 12 మంది మృత్యువాత పడ్డారు.
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో మంటలు చేలరేగాయి. దీంతో 12 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదస్థలం నుండి ఇప్పటివరకు 10 మృతదేహలను బయటకు తీశారు.ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. రాజస్థాన్ లోని బార్మర్ -జోధ్పూర్ హైవేపై ప్రమాదం చోటు చేసుకొంది.
జిల్లా యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొంది. ఇవాళ ఉదయం 9:55 గంటల సమయంలో ప్రైవేట్ బస్సు 25 మంది ప్రయాణీకులతో బయలు దేరింది.ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. అయితే ఈ బస్సులో ప్రయాణీస్తున్న మిగిలిన ప్రయాణీకుల గురించి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.