లోయలో పడ్డ బస్సు: జమ్మూలో 12మంది మృతి
జమ్మూ కాశ్మీర్లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూకాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్టవార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు దోల్ ఏరియాలో లోయలో పడిపోయింది. బస్సుపై డ్రైవర్ కంట్రోల్ తప్పిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు భావిస్తున్నారు.
Kishtwar: 11 dead bodies recovered, 5-year-old injured child shifted to hospital, after a vehicle carrying 'Machel Mata' devotees rolled down in river Chenab 28 kilometres from Kishtwar towards Padder, earlier today. #JammuAndKashmir pic.twitter.com/lAtl5AFzZy
— ANI (@ANI) August 21, 2018
ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరుతీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు కొండచరియలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.